నగల కోసం మహిళ దారుణ హత్య

నగల కోసం మహిళ దారుణ హత్య

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన బెంగరి నర్సవ్వ(40) ను నగల కోసం దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. గత శనివారం నాడు నర్సవ్వ తమ బంధువులను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్ళగా, మరుసటి రోజు తిరిగి రాకపోవడంతో ఆమె భర్త కిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసి టివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా ఆమె శవం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ని ఎగువ మానేరులో లభించింది. కూలీ పని చేసే ఈమెను నగల కోసం మేస్త్రీ హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.