గుండెపోటుతో ప్రవాస భారతీయురాలు మృతి

గుండెపోటుతో ప్రవాస భారతీయురాలు మృతి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయురాలు కదిర సృజన (33) మంగళవారం గుండెపోటుతో మృతి చెందింది. ఇదే మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన సృజనను చిన్న ముప్పారం కు చెందిన రాకేష్ కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేయగా భర్త రాకేష్ ఉద్యోగ జపాన్ దేశంలోనీ టోక్యో నగరంలో స్థిరపడగా రాకేష్ సృజన దంపతులు అక్కడే నివసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం స్వదేశానికి వచ్చిన సృజన అనారోగ్యానికి గురికాగా, వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతుండగా మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఆరేళ్ల కూతురు మీనాక్షి ఉంది. భార్య సృజన మరణ వార్త తెలుసుకున్న భర్త జపాన్ నుంచి బయలుదేరారని, ఆయన వచ్చిన తర్వాత బుధవారం సృజన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.