యువ రైతు ప్రాణాలు బలిగొన్న విద్యుత్తు లైను

యువ రైతు ప్రాణాలు బలిగొన్న విద్యుత్తు లైను

కేసముద్రం, ముద్ర: నేల వాలిన విద్యుత్తు లైను యువరైతు ప్రాణాలను బలిగొన్న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కేంద్రంలో మంగళవారం జరిగింది. నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన రైతు తోట ముత్తయ్య కుమారుడు తోట యశ్వంత్ (22) తన వ్యవసాయ బావి వద్ద ఉన్న ఇనుప నాగలిని ఇంటికి తెస్తుండగా పైన విద్యుత్తు లైన్ కు తాగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటన స్థలిని నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్ సందర్శించి ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలు కావడంతో యశ్వంత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే యశ్వంత్ మరణించాడని, విద్యుత్తు లైను నేలవారిన విషయాన్ని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ లైను లాగలేదని, మధ్యలో మిడిల్ పోల్ వేయలేదని పలువురు ఆరోపించారు.