ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన క్రైస్తవులు 

ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన క్రైస్తవులు 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: మతసహనానికి, సామరస్యానికి, ఆత్మీయతకు ప్రతీకగా గజ్వేల్ నిలిచింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని సెయింట్  జోసెఫ్ స్కూల్ లో మంగళ వారం రాత్రి స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ బ్రిజిట్,జోసెఫ్ మేరి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జఖియుద్ధిన్ పాల్గొన్నారు. సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతు అన్ని మతాలు సమానం అని క్రిస్టియన్ మైనారిటీ వారు,  ముస్లిం సమాజానికి ఇఫ్తార్ విందు ఇవ్వడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అల్వల బాలేష్, నాయకులు హరిచంద్ర ప్రసాద్, కరీం, స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థిని,విద్యార్థినిల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.