కామారెడ్డి చేరుకున్న సిఎం కేసిఆర్

కామారెడ్డి చేరుకున్న సిఎం కేసిఆర్
  • 2 గంటలకు నామినేషన్ దాఖలు
  • బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం      

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  బిఆరెస్ తరపున పోటి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయడానికి హెలికాప్టర్ లో కామారెడ్డికి చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబుద్దిన్ లు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీఓ  కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం నేరుగా బహిరంగ సభ నిర్వహించే డిగ్రీ కళాశాల మైదానానికి వెళ్లనున్నారు. గత వారం రోజులుగా సీఎం పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు సమీక్షిస్తున్నారు. కళాశాల గ్రౌండులో ఉన్న పిచ్చిమొక్కలన్ని క్లీన్ చేశారు. మైదానాన్ని అందంగా ముస్తాబు చేశారు.  కామారెడ్డి వేదికగా సీఎం కేసీఆర్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నారనే చర్చ సాగుతోంది.