రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ బీజేపీ  ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్  కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ విగ్రహం ముందు ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు ధర్నా  నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ  నష్ట పోయిన రైతుకు ఎకరాకు 50 వెలు చెల్లించాలనీ డిమాండ్ చేశారు. రేపటి లోగా స్పందించక పోతే గురువారం వేల మంది రైతులతో ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి చేస్తామని అన్నారు.