ఏడుపాయల ఇఓ బదిలీ మోహన రెడ్డీకి అదనపు బాధ్యతలు

ఏడుపాయల ఇఓ బదిలీ మోహన రెడ్డీకి అదనపు బాధ్యతలు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇటీవల వార్తల్లోకెక్కిన మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమాత దేవస్థానం ఈఓ సార శ్రీనివాస్ బదిలీ అయ్యారు. శివ్వంపేట మండలం చాకరమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయ రెగ్యులర్ ఈఓగా బదిలీ చేస్తూ మంగళవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా గణేష్ గడ్డ ఆలయ ఈఓగా పని చేస్తున్న పి.మోహన్ రెడ్డికి ఏడుపాయల దేవస్థానం ఈఓగా (ఎఫ్ఏసి) నియమించారు.