ఇద్దరు చిన్నారులను చంపి తల్లి
మీర్పేటలో దారుణం
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లలిత నగర్ లో దారుణం కన్నతల్లి ఇద్దరి బాబులను వాటర్ బకెట్లో ముంచి చంపి తను ఆత్మహత్య యత్నంకు పాల్పడిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పరిదిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి ST సెల్ ప్రెసిడెంట్ శ్రీను నాయక్ తన భార్యతో నిన్న రాత్రి గొడవ పడడంతోమనస్థాపానికి గురైన భార్య భారతి (26) తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్లో ముంచి చంపి తను ఆత్మహత్య యత్నం చేసింది. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా భారతి పరిస్థితి విషమం గా ఉందని సమాచారం తెలిపిన కుటుంబ సభ్యులు తెలిపారు