పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ముద్ర న్యూస్. రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో 2007- 2008 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం రోజున నిర్వహించారని ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులందరూ పాఠశాలలో జరిగే మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.
కొందరు ప్రభుత్వ ఉద్యోగులుగా మరికొందరు వివిధ రంగాలలో ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, భాస్కర్,ధర్మారావు, పూర్వ విద్యార్థులు రాంబాబు, సతీష్, హరీష్, రమేష్, రాజ్ కుమార్, శివప్రసాద్, శ్రీధర్, సుధాకర్,సతీష్,స్వప్న, సువర్ణ, మమత,సాగరిక,విజయ, తదితరులు పాల్గొన్నారు.