పెట్రోల్లో నీరు... వాహనదారుల ఆందోళన

పెట్రోల్లో నీరు... వాహనదారుల ఆందోళన

తూప్రాన్, ముద్ర: పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్న కొద్దిసేపటికే బండి ఆగిపోవడంతో పెట్రోల్ తీసి తనిఖీ చేయగా పెట్రోల్లో సగానికిపైగా నీరు ఉండడం చూసి వాహనదారులు ఖంగుతిన్న సంఘటన తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నాగులపల్లి శివారులో గల మెట్రో సర్వీస్ పిల్లింగ్ పెట్రోల్ పంపులో శనివారం ఉదయం వెలుగు చూసింది. పెట్రోల్ కల్తీ విషయంలో వాహనదారులు ఆందోళనకు దిగారు. ఆందోళనను గమనించిన బంక్ యజమానులు బంక్ ముసివేశారు. కల్తీ పెట్రోల్ బంక్ లపై చర్యలు తీసుకోవాలని వాహనరులు డిమాండ్ చేశారు.