బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిగా రాజు గౌడ్

బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిగా రాజు గౌడ్

చిగురుమామిడి ముద్ర న్యూస్:తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిగా చిగురుమామిడి మండల రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న పూదరి రాజు గౌడ్ నియామకం అయ్యారు. బీసీ ఉద్యోగుల సంఘం పటిష్టత కోసం ఉద్యోగులందరినీ సంఘటిత పరిచి సంఘాన్ని మరింత బలోపేతానికి కృషి చేస్తానని రాజు గౌడ్ తెలిపారు. నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూగిళ్ల కిషన్ పటేల్, బీసీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులుమర్రి శ్రీనివాస్ యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు సుదర్శన్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా ముఖ్య సలహా దారులు శ్రీ బుర్ర సుధాకర్ గౌడ్ గారు పాల్గొన్నారు.