ఎస్ఎంసి మాజీ చైర్మన్ కు సన్మానం
![ఎస్ఎంసి మాజీ చైర్మన్ కు సన్మానం](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63edf0571d637.jpg)
చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యాకమిటీ మాజీ చైర్మన్ చెరుకు రాజయ్య ను స్థానిక ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా కమిటీ చైర్మన్ గా గత 4 సంవత్సరాల తన పదవి కాలములో పాఠశాల విద్యాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కొరకు విశేష కృషి చేసారని అన్నారు.
దాతల సహాయమంతో స్కూల్ గోడలకు పెయింట్ వేయించడం, ఫ్యాన్స్, కుర్చీలను సమకూర్చడం, పరిసరాల పారిశుద్యం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో పాటు పూర్వ విద్యార్థులు పలువురు పాఠశాల అభివృద్ధికి చెరుకు రాజయ్య చేసిన సేవలను గుర్తు చేసుకుని అయను అభినందించారు.
ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు శోభారాణి, 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బుర్ర శ్రీనివాస్, వెంకటమల్లు, పొగాకుల రమేష్, శ్యామకూర మహేందర్ రెడ్డి, బుర్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు.