కరీంనగర్ లో ఉద్రిక్తత

కరీంనగర్ లో ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కర్ణాటకలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు ఆంజనేయ స్వామి భక్తులు ఆందోళనకు దిగాలని హిందుత్వ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కరీంనగర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అప్రమత్తమై కాంగ్రెస్ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

హనుమాన్ చాలీసా  పఠిస్తూ హనుమాన్ భక్తులు కాంగ్రెస్ కార్యాలయం  ముట్టడికి ప్రయత్నించారు. దీంతో హనుమాన్ భక్తులను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. జై భజరంగ్ దళ్ జై హనుమాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు హనుమాన్ భక్తులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు హనుమాన్ భక్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.