గ్రూప్ -4 పరీక్షకు స్పెషల్ బస్సులు - అయినా తప్పని ఇక్కట్లు

గ్రూప్ -4 పరీక్షకు స్పెషల్ బస్సులు - అయినా తప్పని ఇక్కట్లు

శంకరపట్నం ముద్ర జూలై 1 :మండల కేంద్రంలో గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు కేటాయించింది.వాటిలో సాధారణ ప్రయాణికులు కూడా ఎక్కడంతో బస్సులు కిక్కిరిసి అభ్యర్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజున గ్రూప్ -4 పరీక్ష నిర్వహించడంతో పరీక్ష రాసే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని వారు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు కేటాయించినప్పటికీ వాటిలో సాధారణ ప్రయాణికులు కూడా ప్రయాణించారు.కొందరు అభ్యర్థులు పరీక్ష సమయం దగ్గర పడుతుండడంతో ఫుట్ బోర్డు ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.