15వ ఆర్థిక సంఘం నిధులపై వార్షిక ప్రణాళిక 

15వ ఆర్థిక సంఘం నిధులపై వార్షిక ప్రణాళిక 

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఎంపీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం 2023 - 24 సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ. 21 లక్షల 19 వేల అంచనా నిధులతో చేపట్టవలసిన పనులను గుర్తించి గ్రామాలలో అత్యవసరంగా చేయవలసిన పనులపై  వార్షిక ప్రణాళికను సిద్ధం చేశారు. గ్రామాలలో స్థిరమైన అభివృద్ధి సాధించుటకు అవసరమైన లక్ష్యాలను నిర్ధారించారు.ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ  బేతి రాజిరెడ్డి, ఎంపీడీవో నర్సయ్య,  మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, బొమ్మనపల్లి ఎంపిటీసీ  మిట్టపల్లి మల్లేశం, సుందరగిరి ఎంపిటీసీ  మెడబోయిన తిరుపతి,  కొండాపూర్ ఎంపిటీసీ  రాగుల  రమేష్,  మూల్కనూర్ ఎంపిటీసీ  పెసరి జమున,  నవాబుపేట ఎంపిటీసీ  మంకు స్వప్న,  రేకొండ -1 ఎంపిటీసీ  కొత్తూరి సంధ్య, అధికారులు  పాల్గొన్నారు