సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ

చిగురుమామిడి మద్ర న్యూస్: చిగురుమామిడి మండల కేంద్రంలోని  ఆలంగిరి మజీద్ కు మండల పరిషత్ నిధుల నుండి మంజూరు అయిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం  ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి టెంకాయ కొట్టి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... సీసీ రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలలోని అంతర్గత రహదారుల నిర్మాణానికి అధిక నిధులు వెచ్చిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, మండల రైతు సమన్వయ అధ్యక్షులు పెనుకుల తిరుపతి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల ప్రచార కార్యదర్శి రాంబాబు, మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్వర్ పాష, సయ్యద్ అంకుష్, ఎండి మైసొద్దిన్ యాకూబ్ పాషా, కాశరాజు ఆంజనేయులు, ఇర్ఫాన్, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.