గ్రామ శాఖ అధ్యక్షునిగా మాతంగి ప్రసాద్

గ్రామ శాఖ అధ్యక్షునిగా మాతంగి ప్రసాద్

శంకరపట్నం ముద్ర సెప్టెంబర్ 22 :శంకరపట్నం మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుని ఎన్నుకున్నారు.తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతం ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు అంతడుపుల సతీష్ ఆధ్వర్యంలో రాజాపూర్ గ్రామంలో గ్రామ అధ్యక్షనిగా మాతంగి ప్రసాద్,ఉపాధ్యక్షులు మాతంగి సంజీవ్, ప్రధాన కార్యదర్శి మాతాంగి పవన్ లను  ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మాతంగి కొమురయ్య సీనియర్ నాయకులు మాతంగి సమ్మయ్య తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు బొజ్జ రవి,మండల కార్యదర్శి ఆరేపల్లి ఓదెలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.