ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..  ముగ్గురు యువకులు మృతి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జి వద్ద సంభవించింది. వివరాల్లోకి వెళితే పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ముగ్గురు యువకులను రాంగ్ రూట్లో ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు చనిపోగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతులు చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్ (27), శివరాత్రి అంజి(26)లుగా గుర్తించారు. ముగ్గురు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హృదయవిధాకర ఘటన చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణే ముగ్గురి చావులకు కారణమంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.