శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

  • కాపాడిన సిఐఎస్ఎస్ అధికారులు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి :-శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళ రాత్రి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యకు యత్నిస్తున్న మహిళను సిఐఎస్ఎస్ అధికారులు కాపాడారు. బాధితురాలిని బెంగళూరుకు చెందిన శ్వేతగా గుర్తించారు. విమానాశ్రయంలో రెండో అంతస్తు నుంచి మహిళ దూకేందుకు యత్నించిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందనే కోణంలో శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.