జిల్లా స్థాయిలో చెల్పూర్ విద్యార్థి ప్ర‌తిభ‌...

జిల్లా స్థాయిలో చెల్పూర్ విద్యార్థి ప్ర‌తిభ‌...

ముద్ర‌, హుజూరాబాద్ : మండ‌లంలోని చెల్పూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న జె. ర‌వితేజ ఇటీవ‌ల జిల్లా విద్యా శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ దినోత్సవం సంద‌ర్భంగా నిర్వ‌హించిన చిత్ర‌లేఖ‌నం పోటీల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చిన బ‌హుమ‌తిని అందుకున్న‌ట్లు పాఠ‌శాల ప్ర‌ధానోపాద్యాయులు అంజ‌య్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈవో జ‌నార్థ‌న్‌రావు, సెక్టోర‌ల్ అధికారి అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డిల చేతుల మీదుగా విద్యార్థి ప్ర‌శంసా ప‌త్రం అందుకున్నాడు.