మృతుల కుటుంబాలకు పరామర్శ...
ముద్ర, హుజూరాబాద్ : మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బల్మూరి వెంకట్ పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రగాడ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈయన వెంట జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, మండల అధ్యక్షులు కిరణ్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేమల పుష్పలత, మైనార్టీ టౌన్ అధ్యక్షుడు ఎండి అప్సర్, తునికి రవి, విజేందర్, ఐలయ్య , సందీప్, సునీత ,కరిమా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.