ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

ముద్ర,జమ్మికుంట 

ఇల్లంతకుంట మండలంలో భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ, భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధ్రువతార భారతదేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహోన్నత వ్యక్తి తన చివరి ఊపిరి వరకు దేశం కోసం శ్రమించిన ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, నవభారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి ప్రదాత ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన మార్గదర్శకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంగిలే రామారావు, కనుమల సంపత్, గుడిశాల పరమేష్, మంకు ఐలయ్య, పైడిపల్లి దేవేందర్, శనిగరపు రాజయ్య, NSUI నాయకులు చాతాల మధు, విష్ణు, అజయ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.