గ్రానైట్ క్వారీలో పేలుళ్లు? మాంసం ముద్దగా కార్మికుడు

గ్రానైట్ క్వారీలో పేలుళ్లు? మాంసం ముద్దగా కార్మికుడు

కేసముద్రం , ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఉన్న  గ్రానైట్ క్వారీలో బుధవారం ఉదయం జరిగిన పేలుళ్లలో అదే గ్రామానికి చెందిన ఎస్కే అమీర్ పాషా (55) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పేలుళ్ల దాటికి అమీర్ పాషా దేహం మాంసం ముద్దగా మారింది.  ఘటన స్థలానికి  సీఐ రమేష్, ఎస్సై తిరుపతి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గ్రానైట్ రాళ్లను తొలగించేందుకు నిర్వహించిన పేలుడుకు బండరాళ్లు ఎగిరిపడి ప్రమాదానికి కారణమైనట్లు చెబుతున్నారు.