కరీంనగర్ కు బయలుదేరిన అస్సాం ముఖ్యమంత్రి

కరీంనగర్ కు బయలుదేరిన అస్సాం ముఖ్యమంత్రి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ కు బయలుదేరారు. మరికొద్ది క్షణాల్లో కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లో హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. అస్సాం ముఖ్యమంత్రి కి బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.

సుమారు 6 గంటల ప్రాంతంలో హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో పాల్గొని మాట్లాడుతారు. ఇప్పటికే హిందూ సంఘటన శక్తిని చాటేందుకు వేలాదిగా కాషాయ దండు కదిలి వచ్చింది. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో కరీంనగర్ మార్మోగుతుంది.