రోజురోజుకు సమ్మెకు పెరుగుతున్న మద్దతు

రోజురోజుకు సమ్మెకు పెరుగుతున్న మద్దతు

శంకరపట్నం ముద్ర జూలై 14 : రోజురోజుకు కార్మికుల సమ్మెకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బిఆర్ఎస్ నాయకులైన కన్నాపూర్ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి దంపతులు మద్దతు ప్రకటించడమే కాకుండా వారి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించారు. వారి న్యాయమైన కోరికలను సత్వరమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెకు మద్దతు రోజురోజుకు పెరగడంతో కార్మికులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో కన్నాపూర్ గ్రామ ఉపసర్పంచ్ అడితం కుమార్ తదితరులు పాల్గొన్నారు.