పురుగుల మందు తాగిన రైతు మృతి

పురుగుల మందు తాగిన రైతు మృతి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : తన భూ సమస్య పరిష్కరించడం లేదంటూ ఐలవోనిపల్లెకు చెందిన రైతు మల్లేష్ నైరాశ్యానికి లోనై కొత్తపల్లి తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఈ నెల 13న పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.