బండి పై కేసు నమోదు చేయండి

బండి పై కేసు నమోదు చేయండి

 పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ మంగళవారం కరీంనగర్ ఒకటవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలో మీడియాతో రఘునందన్ రావు చేసిన చిట్ చాట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగారు పుస్తెలు అమ్మిన బండి సంజయ్ కి వందల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయో విచారణ చేపట్టాలన్నారు. కార్పొరేటర్ వెంట టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోహన్ సింగ్ ఉన్నారు.