ఝాన్సీరెడ్డిని కలిసిన లీడర్లు

ఝాన్సీరెడ్డిని కలిసిన లీడర్లు

ముద్ర ప్రతినిధి, జనగామ (పాలకుర్తి) : కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకురాలు ఝాన్సీరెడ్డిని ఆ నియోజకవర్గ లీడర్లు మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, జిల్లా నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి, గంగు కృష్ణమూర్తి, మురళీధర్ రెడ్డి, పాలకుర్తి మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కాసాని ధర్మారెడ్డి, ఎర్రయ్య, దామోదర్ రెడ్డి, గండిపల్లి యాకయ్య, సైదులు రెడ్డి, కత్తుల సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.