మూడు మండలాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు

మూడు మండలాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు

కాలం చెల్లిన విత్తనాలు పురుగుమందుల స్వాధీనం

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాల్లో మంగళవారం నాడు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ నేతృత్వంలో విత్తనాలు, పురుగు మందుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. పలుచోట్ల కాలం చెల్లిన విత్తనాలు, పురుగుమందు డబ్బాలను స్వాధీనం చేసుకొని వ్యవసాయ అధికారులకు అప్పగించారు. జిల్లాలోని హుస్నాబాద్, అక్కన్నపేట, మిరుదొడ్డి మండలాల్లో పురుగు మందులు, విత్తనాల షాపులు తనిఖీ చేశారు.