సిద్దిపేటలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభినందన సభ పాల్గొన్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్దిపేటలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభినందన సభ పాల్గొన్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్దిపేట:  ముద్ర ప్రతినిధి: ఎమ్మెల్సీగా ఎన్నికైన తెలంగాణ ఉద్యమ కవి ,గాయకుడు దేశపతి శ్రీనివాస్ అభినందన సభ సిద్దిపేటలో నీ పోలీస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ,మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,  ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, జర్నలిస్టు సంఘ నేతలు కే విరాహత్ అలీ, కే రంగాచారి,

ప్రెస్ ఆకాడమీ మాజీ సభ్యులు కే అంజయ్య, సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి, సిద్దిపేట జేఏసీ మాజీ చైర్మన్ డాక్టర్ జి పాపయ్య, సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు మంజీరా కవులు ,ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రజలు పాల్గొన్నారు. అభినందన సభకు ముందు సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద దేశపతి శ్రీనివాస్ జోహార్లు పాటతో అమరవీరులకు నివాళులు అర్పించారు పోలీస్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ సాంప్రదాయమైన బోనాలు ,కోలాటం నృత్యంతో  కళాకారులు దేశపతి శ్రీనివాస్ కు  ఘనంగా స్వాగతం పలికారు అభినందన సభలో ముందుగా దేశపతి తల్లిదండ్రుల చిత్రపటానికి మంత్రి హరీష్ రావు తో అటు అతిథులు పూలతో నివాళులర్పించారు.