రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

దుబ్బాక ముద్ర: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకటి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ఇర్ఫాన్ (35) అనే యువకుడు పనిపై దుబ్బాక వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురై మరణించాడు. ఈ విషయాన్ని అటుగా వెళుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.