పేకాట స్థావరంపై దాడి ఆరుగురు అరెస్ట్
మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖాజీపూర్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.శుక్రవారం మధ్యాహ్నం కొంతమంది వ్యక్తులు కలిసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేష్ సిబ్బందితో కలసి వెళ్లి రైడ్ చేసి 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 33,700 రూపాయలు, 6 మోటార్ సైకిళ్ళు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పట్టుపడ్డ వారిని భూంపల్లి పోలీసులకు అప్పగించగావారు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేష్, మాట్లాడుతూ గ్రామాలలో, ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని కోరారు. పేకాట, జూదం, వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పేకాట ఆడి పట్టుబడ్డ వారిలో వడ్డేపల్లి యాదగిరి, పంజా గోవర్ధన్, పాలమాకుల రమేష్, కన్న సాయికుమార్, పత్తి నర్సింలు, శనిగాపల్లి రాజు ఉండగా ప్రభాకర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు..