దుబ్బాక పై గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయం- జీడిపల్లి రాంరెడ్డి

దుబ్బాక పై గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయం- జీడిపల్లి రాంరెడ్డి

సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక గడ్డ మీద ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమని  సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు  బుధవారం తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో బీఆర్ఎస్ విద్యార్థి,యువజన,సోషల్ మీడియా కమిటీలు వేశారు. ఈసందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి  మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దుబ్బాక పై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా యువకులు క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు..తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ను కళ్ళకు కట్టినట్లు వివరించాలన్నారు.ఈసందర్భంగావెంకట్రావుపేట గ్రామ యూత్ అధ్యక్షునిగా ఎంగళి నరేందర్,సోషల్ మీడియా అధ్యక్షునిగా బెజ్జనమైన నవీన్, విద్యార్థి విభాగం అధ్యక్షునిగా రేపాక రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కంకణాల నర్సింలు, సీనియర్ నాయకులు పాత్కుల వెంకటేశం మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, పిఎసిఎస్,ఆత్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పత్కుల బాలేష్,సూతరి రాములు,ఈదుగాళ్ల పర్శ రాములు,యువ నాయకులు అనిల్ కుమార్,పరమేశ్వర రెడ్డి,బండారు రమేష్ గౌడ్, కోల శ్రీకాంత్ గౌడ్, రమేష్ గౌడ్,కృష్ణ, అశోక్, నిఖిల్, సూతారి రాంబాబు, అజాం,పులిగారి గణేష్, భాస్కర్,ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు.