గ్రూప్ వన్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు

గ్రూప్ వన్ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు

పర్యవేక్షించిన అడిషనల్ డీసీపీ మహేందర్ 

ముద్ర ప్రతినిధి:  సిద్దిపేట: ఆదివారం నాడు జరిగే గ్రూప్ వన్ పరీక్షా కేంద్రాలను సిద్దిపేట అడ్మిన్ డిసిపి ఎం. మహేందర్ పరిశీలించారు.
అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ను పరిశీలించారు.ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మహిందర్ మాట్లాడుతూ  కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి పరీక్ష కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేశామని,  ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ ఉంటుందని, కావున పరీక్షా కేంద్రం వద్ద ఎవరు గుమికూడా వద్దని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుపవద్దని సూచించారు. సిద్దిపేట జిల్లాలో 20 కేంద్రాల్లో గ్రూప్ వన్ పరీక్షనిర్వహించబడుతుందని తెలిపారు.