సిద్దిపేటలో రాధాకృష్ణ మందిరం ఏర్పాటు చేస్తా 

సిద్దిపేటలో రాధాకృష్ణ మందిరం ఏర్పాటు చేస్తా 

శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూప నంద స్వామి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేటలో త్వరలో రాధాకృష్ణ మందిరాన్ని ఏర్పాటు చేస్తానని శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి చెప్పారు సిద్దిపేటలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయం వద్ద ఆదివారం నాడు ఆయన గోశాలను ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట మహిళలు తనకు తల్లులతో సమానమని స్వామీజీ చెప్పారు. ఈ ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమైనందున ఇప్పటికి రెండుసార్లు యాగం నిర్వహించినట్లు తెలిపారు త్వరలో శ్రీకృష్ణ మందిరాన్ని కూడా నిర్మిస్తారు అన్నారు.

మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కడవెరుగు రాజనర్సు మాట్లాడుతూ మూడు కోట్ల రూపాయలతో త్వరలో రామాలయ పునరుద్ధరణ చేస్తున్నట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు సహకారంతో పాత దేవాలయానికి మళ్లీ మహర్దశ రానుందని చెప్పారు. హనుమాన్ దేవాలయ కమిటీ అధ్యక్షుడు అనిల్ శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఊదర జయ, మహిళా భక్త బృందం సభ్యులు, పారుపల్లి వీధి నాయకులు, హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.