భగీరథ నీటితో రోగాలకు చెక్

భగీరథ నీటితో రోగాలకు చెక్
  • కేసీఆర్ వచ్చాకే సురక్షితమంచినీరు
  •  పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులది
  • ఫ్లోరోసిస్ శాపం ప్రకృతి నుండి వచ్చింది కాదు
  • ఆ పాపం కాంగ్రెస్ పాలకులదే
  • 2014 కు ముందు నీటి కుళ్ళాయిల వద్ద కొట్లాట
  • బిందెడు నీళ్ల కోసం తండ్లాట
  • గుక్కెడు నీటి కోసం ముష్టి ఘాతుకాలు
  • పోలీస్ స్టేషన్లో కేసుల పాలు
  • జీవనదులు పారుతున్నా
  • వాటిపై తెలంగాణా కు హక్కులు ఉండి కుడా
  • గుక్కెడు నీళ్లు ఇచ్చి గొంతులు తడపని వైనం
  • ఇది 2014 కు ముందు జరిగిన తంతు
  • కేసీఆర్ వచ్చాకే ఫ్లోరోసిస్ మటుమాయం
  • సూర్యాపేటకు సురక్షిత త్రాగు నీరు
  • 50 వేళకోట్లతో మిషన్ భగీరథ
  • ఇంటింటికీ సురక్షితమైన త్రాగు నీటి సరఫరా
  • ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 917 కోట్లతో ఇంటింటికి నీటి సరఫరా
  • చేసిన ద్రోహం మరచి కాలి యాత్రలు,మోకాలి యాత్రలంటూ
  • మరోసారి మోసానికి ఓడి గట్టేందుకు బయలు దేరిన దండు
  • పాయాఖానా నీళ్లు తపించినోళ్ళను పాతర పెట్టండి
  • ఫ్లోరోసిస్ అంటగట్టిన వారిని పొలిమెర్లుల్లోకి తరిమికొట్టాలి:మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: మిషన్ భగీరథ నీటితో ప్రాణాంతక వ్యాధులను కట్టడి చేయవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సురక్షితమైన మంచినీటి సరఫరా జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రవతరణ దినోత్సవ దశాబ్దిఉత్సవాలలో బాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన మంచి నీటి పండుగ సంబరాలలో మంత్రి జగదీష్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జలసాదన ఉద్యమ నేత దుశ్చర్ల సత్యనారాయణ, మిషన్ భగీరధ అధికారి సురేష్,జిల్లా ప్రజా పరిషత్ అధికారి సురేష్,మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి మిషన్ భగీరధ అధికారి సురేష్ ఆధ్వర్యంలో ఆ శాఖా సిబ్బంది బోర్ నీటితో పాటు కొన్న నీటితో సంభవించే దుష్పరిణామాలు వివరించడంతో పాటు మిషన్ భగీరథ నీటితో ప్రాణాంతక వ్యాధులకు ఎలా చెక్ పెట్టవచ్చు అనేది సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట కు పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులకు దక్కుతుందని ఎద్దేవాచేశారు. అటువంటి నేతలు కాలి యాత్రా,మోకాలి యాత్ర,అంటూ మరోమారు ప్రజల్ని మోసం చెయ్యడానికి ఓ దండు బయలు దేరిందన్నారు.అటువంటి యాత్రలలో పాల్గొంటున్న నేతలు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తూన్నారని ఆయన నిలదీశారు.

2014 కు ముందు త్రాగు నీటి కోసం కుళ్ళాయిల వద్ద కొట్లాట,బిందెడు నీళ్ళకోసం తండ్లాట ,గుక్కెడు నీటి కోసం ముష్టి ఘాతుకాలు,పోలీస్ స్టేషన్ల పాలు, కేసులు కాంప్రమైజ్ లు అంటూ వీధులపాలైన సందర్భాలను ఆయన ఉటంకించారు. అటువంటి దౌర్బగ్య స్థితి నుండి బయటపడి సురక్షిత మైన నీటితో అభివృద్ధి, సంక్షేమం లో భాగస్వామ్యం అయిన ప్రజల్ని మోసం చేయడానికే ఆ యాత్రలు అంటూ ఆయన మండిపడ్డారు. జీవనదులు పారుతున్నా,వాటిపై తెలంగాణా కు హక్కులు ఉన్నా,సీమాంధ్ర నేతలకు దడుసుకుని గుక్కెడు నీళ్లతో గొంతులు తడపని నైజం నాటి కాంగ్రెస్ పాలకులదంటూ ఆయన విరుచుకుపడ్డారు. అటువంటి దుస్థితి నుండి బయటపడేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేల కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా టైం బౌండ్ తో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి త్రాగు నీరు సరఫరా చేస్తున్నామన్నారు. అటువంటి సరఫరాలో ఒకటైన ఇమాంపేట ట్రీట్ మెంట్ ప్లాంట్ లో జరుగుతున్న మంచినీటి పండుగలో భాగస్వామ్యం అయినా వారు అటువంటి వాగుడు కు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరధ నీటితోటే కాంగ్రెస్ పాలకులు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ పాపాన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ మటుమాయం చేశారన్నారు.ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 917 కోట్లతో ఇంటింటికి సురక్షితమైన త్రాగు నీరు సరఫరా చేస్తుండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5102.39 వేల కొట్లతో 6 లక్షల 94 వేల24  ఇండ్లకు త్రాగు నీటి సరఫరా కొనసాగుతుందన్నారు.అటువంటి అద్భుతాలను మరచిపోయిన కాంగ్రెస్ పార్టీ రేపోమాపో ఎన్నికలు వస్తున్నాయని ఉప్పు అందంగానే తొమ్మిదేళ్లలో ఏమి చేశారంటూ విమర్శల దాడులకు పునుకుంటున్నారన్నారు.అలా నోరు తెరిచిన గొంతుకలకు సమాధానం మూతి మీద కొట్టేలా ఉండాలి అంటూ ఘాటుగా విమర్శించారు.