మద్యం కు బానిసయి వ్యక్తి ఆత్మహత్య

మద్యం కు బానిసయి వ్యక్తి ఆత్మహత్య

నంగునూరు, ముద్ర: మద్యం కు బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. రాజగోపాల్ పేట ఎస్ ఐ కథనం ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోదాసు ఎల్లం 40 వడ్డెర కులవృత్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు గత నాలుగు సంవత్సరాల నుండి మద్యం కు బానిసవడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఎల్లం గ్రామంలోని గడ్డమీద కుంట వద్ద కానుగ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేస్తున్నట్లు తెలిపారు. మృతుని భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాజగోపాల్పేట ఎస్ఐ రాజు తెలిపారు.