సిద్దిపేట బిఆర్ఎస్ లో భారీగా చేరికలు

సిద్దిపేట బిఆర్ఎస్ లో భారీగా చేరికలు
  • మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరిన 106 మంది  బజరంగ్ దళ్ 
  • మాజీ నేత పేరుక ఆంజనేయులుతో పాటు అనుచరులు చేరిక

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:-భారత రాష్ట్ర సమితి సిద్దిపేట పట్టణ శాఖలోకి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో 106 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో ఎక్కువ శాతం యువకులే ఉన్నారు.మాజీ భజరంగ్దళ్ జిల్లా నాయకుడు పేరుక ఆంజనేయులు తోపాటు సంజీవయ్య నగర్,అంబేద్కర్ నగర్ లకు చెందిన వివిధ పార్టీల్లో పనిచేస్తున్న యువకులు పేరుక సాయి,కే పవన్, పంగ కార్తిక్, పుట్ల వంశీ, ఐ తిరుపతి,పొన్నాల మహేష్ తదితరులు వారి అనుచరులతో మంత్రి సమక్షంలో  బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారందరికీ కండువాలు వేసి స్వాగతం పలికారు. అంబేద్కర్ నగర్ ఏరియా కౌన్సిలర్  గ్యాదరి రవీందర్,పట్టణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి,రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.