బైకును తప్పించబోయే చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో నుంచి బయటపడ్డ ఎమ్మెల్సీ

బైకును తప్పించబోయే చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో నుంచి బయటపడ్డ ఎమ్మెల్సీ

ముద్ర, జమ్మికుంట: సోమవారం ఉదయం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న టు కే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కు వెళ్తున్నారు. శంకరా పట్నం మండలం తాడికల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి సమీపంలోకి బైకు  రావడంతో కారు డ్రైవర్ ప్రమాధాన్ని తప్పించబోయి రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. వాహనంలో బెలూన్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి  ప్రమాదం తప్పింది. అక్కడనుండి ఎమ్మెల్సీ వేరే కార్లో హుజురాబాద్ కు బయలుదేరారు. బైక్ పై వెళుతున్న రైతుకు స్వల్ప గాయాలు కావడంతో 108 లో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు.