కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మండల అధ్యక్షులు గా సలీం ఖాన్

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మండల అధ్యక్షులు గా సలీం ఖాన్

ఖానాపూర్, ముద్ర : ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మండల అధ్యక్షులు గా సలీమ్ ఖాన్ ను, మైనారిటీ పట్టణ అధ్యక్షులు గా షౌకత్ పాషా లను నియమించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కె. శ్రీహరి రావ్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు జునేద్ మెమన్ లు ఈ సందర్బంగా నియామక పత్రాన్ని అందజేశారు.  రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని,  మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.  శ్రమించి పార్టీ బలోపేతనికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  దయనంద్, పార్టీ జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నాయకులు జహీర్ అహ్మద్, తోట సత్యం, శెట్టి శ్యామ్, సయ్యద్ ఆయుబ్, శారు తదితరులు పాల్గొన్నారు.