గ్రూప్ -4 పరీక్ష ప్రారంభం

గ్రూప్ -4 పరీక్ష ప్రారంభం
  • క్షుణ్ణంగా తనిఖీలు
  • మూర్చతో పడిపోయిన అభ్యర్థి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో గ్రూప్-4 పరీక్ష ప్రారంభమైంది. జిల్లాలో మెదక్ తోపాటు తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, చేగుంటలో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద ఓ అభ్యర్థి మూర్చతో పడిపోయాడు. అక్కడే ఉన్న వైద్య  సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. స్పృహలోకి వచ్చిన అభ్యర్థి పరీక్ష రాసేందుకు హాలులోకి వెళ్ళాడు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో పకడ్బంది ఏర్పాట్లు చేశారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షణలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తూ ఏర్పాటు చేశారు.