బిఆర్ఎస్ లో చేరిన తిరుపతిరెడ్డి గులాబీ కండువా వేసిన కెటిఆర్

బిఆర్ఎస్ లో చేరిన తిరుపతిరెడ్డి గులాబీ కండువా వేసిన కెటిఆర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చె్సిన కంటారెడ్డి తిరుపతి రెడ్డి గులాబీ గూటికి చేరారు. శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి తదితరులున్నారు.