ముత్తాయికోట సిద్దేశ్వరుని సేవలో ఎమ్మెల్సీ శేరి

ముత్తాయికోట సిద్దేశ్వరుని సేవలో ఎమ్మెల్సీ శేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: మహాశివరాత్రి సందర్భంగా సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా హావేలి ఘనపూర్ మండలం ముత్తాయికోటలోని ప్రసిద్ధ శ్రీ సిద్దేశ్వర  ఆలయాన్ని దర్శించారు. దంపతులు అభిషేకంలో పాల్గొన్నారు.   అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిమాన్విత క్షేత్రం సిద్దేశ్వర స్వామి ఆలయమన్నారు. వెంట సర్పంచులు మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్, అలయకమిటీ భిక్షపతి, మాజీ సర్పంచ్ కిరణ్ గౌడ్, తదితరులు ఉన్నారు..