రామాయంపేటలో రైతుల రాస్తారోకో

రామాయంపేటలో రైతుల రాస్తారోకో

అక్కన్నపేటలో బైపాస్ రోడ్డు వద్దని డిమాండ్
ముద్ర ప్రతినిధి, మెదక్: రామాయంపేట మండలంలో బైపాస్ రోడ్డు వద్దని, పాత రోడ్డునే  వెడల్పు చేయాలంటూ రైతులు గురువారం రాస్తా రోకో చేశారు. మండలంలో నేషనల్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా పట్టణంతో పాటు మండలంలోని తొనిగండ్ల, అక్కన్నపేటల్లో  బైపాస్ రోడ్డు నిర్మాణానికిగాను రెవెన్యు అధికారులు  భూ సర్వే జరిపి, రైతులకు ఇటీవల నోటీసులు పంపారు.  దీంతో  ఆగ్రహించిన భూ బాధితులు  పెద్ద ఎత్తున రామాయంపేట చేరుకుని మెదక్ రోడ్డులో రాస్తా రోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరే కంగా  నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు వేయడం వల్ల తాము విలువైన భూములు, భవనాలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పాత రోడ్డునే వెడల్పు చేయాలని కోరారు. అక్కడి నుంచి స్థానిక తహశీల్దార్ కార్యాలయం చేరుకుని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ యాదగిరి, ఎర్రం నాగరాజు,బక్కన్న గారి గణేష్,. సారుగు భాగయ్య తదితరులు ఉన్నారు.