ఫలాంభరిగా మెదక్ రేణుకా మాత

ఫలాంభరిగా మెదక్ రేణుకా మాత

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పసుపులేటి ఒడ్డున వెలసిన శ్రీ రేణుకామాత ఆషాఢమాసం సందర్భంగా మంగళవారం ఫలంభరీగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకం అనంతరం వివిధ రకాల పండ్లతో అలంకరించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు, గౌడ సంఘం సభ్యులు, భక్తులు, మహిళలు హాజరయ్యారు.