నిద్దురోయే ప్రాంతం..
- ఎక్కడపడితే అక్కడే నిద్దురోతారు!
కజకిస్తాన్: ఆ ప్రాంతంలో నడుస్తూనే నిద్దురలోకి జారుకుంటారు! రోజుల తరబడి లేవరు కూడా లేవరు! అదే కజికిస్థాన్లోని కలాచీ ప్రాంతం. ఇక్కడి జనాభా 600. ఇందులో 14 శాతం మంది అంటే 84 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 2010లోనే వ్యాధిని గుర్తించి చికిత్సలందిస్తున్నా క్రమేణా వ్యాధి వ్యాప్తి ఎక్కువైంది. దీంతో మనిషి నడుస్తూ నడుస్తూనే ఎక్కడపడితే అక్కడే నిద్దురలోకి జారుకుంటాడు. వైద్యనిపుణులు పరిశీలించి ఈ వ్యాధి ‘స్లీప్హోలో’గా గుర్తించారు. అసలు ఈ వ్యాధి ఎలా వీరికి సంక్రమించిందన్నది ఇప్పటికే మిస్టరీగానే ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం యూరేనియం నిల్వల మైనింగ్ జరిగేదని శాస్ర్తవేత్తల పరిశోధనలో తేలింది. ఈ ప్రభావం ఏమైనా ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో రేడియేషన్ ప్రభావం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని శాస్ర్తవేత్తలే పేర్కొనడం కూడా గమనార్హమే. ఏది ఏమైనా ప్రపంచంలోని మనుషులు నిద్దురపోయే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కజకిస్తాన్లోని కలాచీనే అని చెప్పాలి.