శ్రీ మహంకాళి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

శ్రీ మహంకాళి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:రామాయంపేట పట్టణంలో శ్రీ మహంకాళి మాత వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ శేరి సుభాష్ రెడ్డి  అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలను సుఖ సంతోషాలతో వుంచి,పాడిపంటలు సమృద్ధిగా పండి వర్షాలు బాగా కురవాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట నిజాంపేట జడ్పిటిసి పంజా విజయ్ కుమార్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, ఎంపీటీసీ రాజిరెడ్డి, మహంకాళి ఆలయ కమిటీ డైరెక్టర్లు ఎర్రం ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు, నూతన డైరెక్టర్లు కొతోళ్ల శ్రీనివాస్, తోట కిరణ్, మాజీ వార్డు మెంబర్ మల్లేశం, సొసైటీ డైరెక్టర్ దేవుని నర్సింలు, సర్పంచులు మహిపాల్ రెడ్డి, నాయకులు  నోముల శ్రీకాంత్, శ్రీను నాయక్, గోపాల్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రావ్, బీఆర్ఎస్ నాయకులు పోచయ్య, నరేష్ నాగరాజు,సందీప్,విజయ్,  రంజిత్, చింటూ, సందీప్, భాస్కర్, మోహన్, నవీన్ వినయ్, పరశురాములు తదితరులు ఉన్నారు.