పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి - ఎంపీపీ పడిగెల మానస 

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి - ఎంపీపీ పడిగెల మానస 

ముద్ర,తంగళ్ళపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పడిగెల మానస  మాట్లాడుతూ పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి అని  కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని దరఖాస్తు చేయించుకున్న పేదలందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజన్న,స్థానిక సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, వార్డు సభ్యులు క్యారమ్ జగత్,  పర్శరంలు, కొడం సంధ్య రాణి, నేరల్ల అనిల్, ఎగుర్ల కర్నాకర్,నులుగొండ శ్రీనివాస్,వెంకట రంగం,అరవింద్,అంకారపు మహేష్,వెంగల రమేష్, తదితరులు పాల్గొన్నారు.