చేపల వేటకు వెల్లి నీట మునిగి ఒకరు మృతి

చేపల వేటకు వెల్లి నీట మునిగి ఒకరు మృతి

తూప్రాన్ ముద్ర: చేపల కోసం వెళ్లి చెరువులో నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సందీప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అనయతుల్లా(28) కాల్లకల్ లో ఉంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం గ్రామంలోని ఊర చెరువులో చేపల కోసం వెళ్లి చెరువులో నీటమునిగి మృతి చెందాడు  శనివారం ఉదయం మృతదేహం నీటిలో తేలగ మృతదేహాన్ని బయటకు తీసి తూప్రాన్ ప్రభుత్వ అస్పత్రి మార్చురికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సందీప్ రెడ్డి తెలిపారు.