యువకుడు ఉరిసుకుని ఆత్మహత్య

యువకుడు ఉరిసుకుని ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం మల్లెం చెరువు కట్టపై వైశ్య స్మశాన వాటిక సమీపంలో గుర్తుతెలియని యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 30 -35 సంవత్సరాల వయసు గల యువకుడు చెట్టుకు ఉరి వేసుకున్నట్లు గమనించి మెదక్ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఎవరనేది తెలియ రాలేదు. యువకుడు స్థానికుడా లేక స్థానికేతరుడా అనేది పోలీసుల దర్యాప్తు అనంతరం తెలియనుంది.